Monday, May 6, 2024
- Advertisement -

కొత్తపేట ఎఫెక్ట్..జనసేన జెండాలు దగ్దం

- Advertisement -

టీడీపీ -జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ ఏమో కానీ రెండు పార్టీల నేతల మధ్య మాత్రం అసంతృప్తి చల్లారడం లేదు. ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయిన దగ్గరి నుండి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఇరు పార్టీల నేతలు పలుచోట్ల జెండాలు,బ్యానర్లు చింపేసి దగ్దం చేసిన పరిస్థితి నెలకొంది.

తాజాగా డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా లో జనసేన పార్టీ నేతలు పవన్‌పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. కొత్తపేట టికెట్ టీడీపీ కేటాయించడాన్ని తప్పుబట్టిన నేతలు పార్టీ కార్యాలయం వద్ద జెండాలు పీకేశారు. అంతటితో ఆగకుండా జనసేన జెండాలు ,ఫ్లెక్సీలు తొలగించి దగ్ధం చేశారు.

ఎన్ని కష్టాలొచ్చిన పార్టీ కోసం పనిచేశామని కానీ పవన్ ఇవాళ తమకు అన్యాయం చేశారని నేతలు ఆరోపించారు. చంద్రబాబు మంత్రాలు చదువుతున్నట్లు అభ్యర్థులను ప్రకటిస్తుంటే పక్కన కూర్చున్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు నిజంగానే ప్యాకేజీ ఇచ్చారని తమను హేళన చేస్తున్నారన్నారు.

అవమానాన్ని భరించలేక జనసేన జెండాలు ఫ్లెక్సీలు దగ్ధం చేస్తున్నాం అని, ఇప్పటికైనా కొత్తపేట టికెట్ పై టీడీపీ,జనసేన నేతలు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన నాయకుడు బండారు శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -