తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతున్నాయి. వరుస ఈడీ దాడులు, సిబిఐ సోదాలు, ఐటీ రైడ్ లు ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా అధికార బిఆర్ఎస్ పార్టీ నేతలే టార్గెట్ గా కేంద్ర సంస్థలను మోడి సర్కార్ ప్రయోగిస్తుందనే ఆరోపణలు గట్టిగానే వస్తున్నాయి. డిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కేటిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేసిన మోడి సర్కార్.. బెంగళూరు డ్రగ్స్ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ ను టార్గెట్ చేశారు. కేటిఆర్ డ్రగ్స్ తీసుకుంటారని కమలనాథులు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. అలాగే కేసిఆర్ కుటుంబం లెక్కకు మించి అవినీతికి పాల్పడిందని.. వాళ్ళంతా కచ్చితంగా జైలుకు వెళ్ళడం ఖాయం అని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చాలా సందర్భాల్లో ఘాటు విమర్శలు చేశారు. .
ఇక తాజాగా బండి సంజయ్ ఆరోపణలకు కేటిఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ” బేకరు మాటలు మాని ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అంటూ సూచించారు. డ్రగ్స్ టెస్ట్ కోసం నా చర్మం, రక్తం అవసరమైతే బొచ్చు కూడా ఇస్తా.. డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపించండి అంటూ కేటిఆర్ అన్నారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని నిరూపితం అయితే చెప్పుతోకొట్టుకోవడానికి సిద్దమా బండి సంజయ్ కి సవాల్ విసిరారు. నిన్ను గెలిపించిన కరీంనగర్ కు నువ్వే చేశావంటూ నిలదీశారు కేటిఆర్. డిల్లీలో పలుకుబడి ఉండని చెప్పుకొని తిరిగే నువ్వు.. నీ పలుకుబడి ఉపయోగించి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మెగా పవర్ క్లస్టర్ ను తీసుకురావాలంటూ సూచించారు. బీజేపీ నేతలుకు దమ్ము ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని చెప్పుకొచ్చారు. ఉదయం నిద్ర లేచినది మొదలుకొని కేసిఆర్ ను తిట్టడం మాని ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేటిఆర్. మరి కేటిఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఇవి కూడా చదవండి
మల్లారెడ్డి రాజకీయం.. బిఆర్ఎస్ కు తలనొప్పే ?