Monday, April 29, 2024
- Advertisement -

సస్పెన్స్‌కు తెర..మచిలీపట్నం అభ్యర్థి అతనే!

- Advertisement -

జనసేన తరపున పోటీచేసే మచిలీపట్నం అభ్యర్థిని ప్రకటించారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తులో భాగంగా జనసేన నుండి వల్లభనేని బాలశౌరి చేస్తారని ప్రకటించారు పవన్. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించారు జనసేనాని.

జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తుండగా మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ బాలశౌరికే టికెట్ కేటాయించారు. ఇక 18 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అవనిగడ్డ,విశాఖ వెస్ట్,పాలకొడ అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

అవనిగడ్డ నుండి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అభ్యర్థి ఎవరనే దానిపై క్లారిటీకి రాలేకపోతున్నారు పవన్. వాస్తవానికి మచిలీపట్నం లోక్ సభ స్థానానికి బాలశౌరితో పాటు మరికొందరి పేర్లను పరిశీలించారు. దీంతో బాలశౌరి వర్గీయులు తీవ్ర ఆదోళనకు గురికాగా ఎట్టకేలకు టికెట్ దక్కించుకున్నారు. మిగిలిన మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -