Sunday, May 5, 2024
- Advertisement -

హమ్మయ్య..పవన్‌కు ఒకదానిపై క్లారిటీ వచ్చేసింది!

- Advertisement -

జనసేనాని పవన్ ఎక్కడి నుండి పోటీ చేయాలన్నదానిపై కాస్త క్లారిటీ వచ్చినట్లుంది. గత ఎన్నికల్లో భీమవరం,గాజువాక రెండు స్థానాల నుండి పవన్ పోటీచేయగా రెండింట్లో ఓటమి పాలైంది. దీంతో ఈసారి పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తారా అన్నదానిపై పుకార్లు షికార్ చేస్తున్నాయి. అయితే పవన్ రెండు చోట్ల నుండి పోటీ చేస్తారని ప్రకటించగా అందులో ఒకదానిపై క్లారిటీ వచ్చేసింది.

ఇవాళ భీమవరం పర్యటనలో భాగంగా తాను పోటీ చేసే ఒక స్థానం ఇదేనని చెప్పకనే చెప్పేశారు పవన్. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను కలిశారు. తొలుత విశాఖపట్నం వెళ్లి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పవన్..తర్వాతి రోజే భీమవరానికి వెళ్లారు.

అక్కడ టీడీపీ నేతలు తోట సీతారామలక్ష్మి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో పాటు బీజేపీ నేతలను కలిశారు. తాను భీమవరం నుండి పోటీ చేస్తున్నానని తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పవన్ పోటీ చేసే ఒక స్థానంపై క్లారిటీ రాగా రెండో స్థానం ఎక్కడి నుండి అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -