Sunday, April 28, 2024
- Advertisement -

జగన్ మరో మాస్టర్ స్కెచ్..సూపర్బ్!

- Advertisement -

ఏపీ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉండగా సీఎం జగన్ దూకుడు ఎవరికి అంతు చిక్కడం లేదు. సిట్టింగ్‌లకు సీట్ నిరాకరించడం దగ్గరి నుండి సిద్ధం సభల వరకు తన ప్లాన్‌ను పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు జగన్. ఇక వైసీపీ సిద్ధం సభలకు జనం పోటెత్తుతుండటంతో ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితి నెలకొంది.

ఇక తాజాగా మరో మాస్టర్ స్కెచ్ చేశారు జగన్. ఎన్నికలకు రెండు నెలల ముందే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 47 వేల పోలింగ్‌ బూతులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రతీ వార్డుకు కన్వీనర్లను నియమించగా 15 మంది బూత్ స్ధాయి కమిటీలను ఏర్పాటు చేశారు.

మేుము సిద్ధం- మా బూత్ కమిటీలు సిద్ధం అనే నినాదాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ప్రతిపక్ష టీడీపీ కూటమి ఇంకా పొత్తుల ఫైనల్ దశలోనే ఉండగా జగన్ మాత్రం ఇప్పటికే సగానికిపైగా స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చి అభ్యర్థుల చేత ప్రచారాన్ని కూడా చేయిస్తున్నారు. మొత్తంగా జగన్ వేసే ప్రతి అడుగు వైసీపీని విజయానికి దగ్గర చేస్తుండగా విపక్షాలు మాత్రం జగన్ ఇస్తున్న మాస్టర్ స్ట్రోక్‌తో బిత్తరపోతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -