Tuesday, May 7, 2024
- Advertisement -

వైసీపీదే అధికారం..తేల్చి చెప్పిన సర్వే

- Advertisement -

ఏపీలో రెండోసారి తిరుగులేని మెజార్టీతో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. సీఎం జగన్ సైతం ఇప్పటికే ఎన్నికల్లో గెలుపు కోసం తనదైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. అందుకే సర్వే ఏదైనా వైసీపీదే విజయమని తేల్చేస్తున్నాయి.

తాజాగా జన్‌మత్ పోల్స్ నిర్వహించిన సర్వేలో వైసీపీ 116 నుంచి 118 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని తెలిపింది. మరోసారి ప్రజల మద్దతు సీఎం వైయస్ జగన్‌కేనని వెల్లడించింది. గతంలో టైమ్స్ నౌ, పొలిటికల్ క్రిటిక్, పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందని తెలపగా తాజాగా ఎన్నికలు సమీపిస్తున్వ వేళ జన్‌మత్‌ సర్వే వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడించింది.

తెలంగాణ ఎన్నికల్లో జన్ మత్ సర్వే నిజమైంది. టీడీపీ, జనసేన కూటమికి కేవలం 46 నుంచి 48 సీట్లు దక్కుతాయని తెలిపింది.టైమ్స్ నౌ గ్రూప్-ఈటీజీ గ్రూప్ సర్వేల్లోనూ ఏపీలో 51 శాతం ప్రజలు వైయస్‌ఆర్‌సీపీకే జై కొడతారని స్పష్టమైంది. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారంతా తిరిగి జగనన్న ప్రభుత్వానికే అండగా నిలుస్తారని.. టీడీపీ జనసేన కలిసినా ఫ్యాన్ ప్రభంజనం ముందు నిలిచే అవకాశం లేదని అన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -