హాలీవుడ్ స్థాయి సినిమాగా రూపొందుతున్న సినిమాగా ప్రభాస్ నటిస్తున్నాడు. ఆ సినిమానే ‘సాహో’. ఈ సినిమా షూటింగ్పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ షెడ్యూల్ కోసం వెళ్లింది. అక్కడ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ సినిమాలో తమిళ తలైవా రజనీకాంత్ హీరోయిన్ ఆడిపాడే అవకాశం ఉంది.
దర్శకుడు సుజిత్తో ప్రభాస్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తుండడం అందరికీ ఆశ్చర్యమేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో ప్రభాస్ పక్కన శ్రద్ధా కపూర్ నటిస్తోంది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె నటిస్తుండగా ఆమెతో ఇప్పుడు బ్రిటీశ్ సుందరి అమీ జాక్సన్ నటించనుందని ఇప్పుడు వస్తున్న సమాచారం.
రామ్చరణ్ ‘ఎవడు’, శంకర్ ‘ఐ’, ధనుశ్ ‘నవ మన్మధుడు’ సినిమాల్లో అందచందాలతో ఆకట్టుకున్న అమీ జాక్సన్ ఈ సినిమాలో క్యామియో కోసం దర్శకుడు సుజిత్ సంప్రదించాడంట. అయితే క్యామియోనా లేక ఏదైనా స్పెషల్ ఐటెం పాటనా అనేది ఇంకా తెలియలేదు. అమీ జాక్సన్ ప్రస్తుతం రజనీకాంత్తో కలిసి ‘2.0’ సినిమాలో నటిస్తోంది.
పూర్తి యాక్షన్ అండ్ స్టైలిశ్ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం వేసవిలో విడుదల చేసే అవకాశం ఉంది.ఈ సినిమా తర్వాత ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.