Sunday, May 12, 2024
- Advertisement -

మంచు లక్ష్మి షోలో అనసూయకు ఏం పని..?

- Advertisement -

టాలీవుడ్ లో ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందని చెప్పలేని పరిస్థితి. భారీ అంచనాలు ఉన్న సినిమా ప్లాప్ కావచ్చు.. ఏం అంచనాలు లేని సినిమా మంచి హిట్ కొట్టొచ్చు. అయితే ఈ విషయంలో బడా నిర్మాతలు ప్లాన్ చేసి.. జగ్రత్తగా ఉంటారని.. ఇదే సమయంలో కొంతమంది నిర్మాతలు సినిమాలతో వస్తున్న నష్టాలను పూడ్చడానికి వేరే మార్గాలను చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇప్పుడు ఈ కోవలోకే మంచు లక్ష్మీ ప్రసన్న కూడా వస్తుందనే న్యూస్ బయటకు రావడం విశేషం అనే అనాలి. ఇప్పటికే నిర్మాతగా పలు సినిమాలు తీసిన మంచు లక్ష్మి పెద్దగా కాదు.. చిన్నగా కూడా సక్సెస్ కాలేదనే చెప్పాలి. అందుకే ఇప్పుడు ఆమె బుల్లితెరను టార్గెట్ చేశారు. సీనియర్ నిర్మాతలు, నటీనటులు ఎక్కువగా బుల్లితెర షో లను ప్రొడ్యూస్ చేస్తూ మంచి వసూళ్లు రాబడుతుండటం మంచు లక్ష్మిని ఆకట్టుకుందట. అందుకే ఆమె కూడా ఆ రిస్క్ చేస్తోంది. బుల్లితెరపై ఒక షో ను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతుందని తాజా సమాచారం. అయితే మంచు లక్ష్మీ ఈ షోకి హోస్ట్ గా చేయడం లేదు. బుల్లితెరపై మంచు లక్ష్మి కొత్త కాకపోయినా.. ఈసారి హాట్ బ్యూటీ అనసూయ సాయం తీసుకుని వస్తుండటమే ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. ఆ షోను నడిపించే బాద్యతను మంచు లక్ష్మి.. అనసూయకి అప్పగించిందట.

ఇక ఈ షో ఇప్పుడు మంచు వారి సమర్పణలో ‘ఫిదా’ అంటూ బుల్లితెరపై పలకరించబోతుందని తెలుస్తోంది. దీంతో మంచు లక్ష్మి అండతో అనసూయ మళ్ళీ ఆ టాలెంట్ చూపించే యాంకర్ పనే చేయనుందని బుల్లితెర వర్గాలు అంటున్నాయి. మరోవైపు, ఈ షో పై మంచు లక్ష్మి చాలానే ఆశలు పెట్టుకుందని కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలతో చాలానే నష్టపోయిన మంచు లక్ష్మి.. ఈ షో హిట్ అయితే, కొంచెం హ్యాపీగా ఫీలవుతుందని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -