బాబీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా జై లవ కుశ. ఇటివలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు సినిమా యూనిట్. ఈ టీజర్ పై.. రాజమౌళి, రామ్ గోపల్ వర్మలతో పాటు చాలా మంది స్పందించారు.
ఈ సినిమా టీజర్ పై బాహుబలి స్టార్ ప్రభాస్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. సోషల్ మీడియాలో పెద్దాగా ఉండని ప్రభాస్.. ఈ సినిమా టీజర్ చూసి.. వెంటనే ఎన్టీఆర్ కు స్వయంగా కాల్ చేశాడట. సాహో షూటింగ్ తో బిజీగా ఉన్నా కూడా టీజర్ ను చూసిన తర్వాత ప్రభాస్ వెంటనే ఎన్టీఆర్ కు ఫోను చేయకుండా ఉండలేకపోయాడట. ఎన్టీఆర్ తో ప్రభాస్ మాట్లాడుతూ.. నీకు ఇలా ఎలా సాధ్యం అవుతుంది డార్లింగ్. కల్లలో ఆ పవర్ ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి.. బాబోయ్ నువ్వు సూపర్ డార్లింగ్. అంత యాక్షన్ సీన్స్ ను చాలా సింపుల్ గా చేశావు. ఇక ఆ డైలాగ్ చెప్పే విధానం అయితే చాలా బాగా నచ్చింది నాకు.. చివర్లో నత్తి పోయినట్లుగా డైలాగ్ చెప్పి సూపర్ అనిపించవు డార్లింగ్ అని మెచ్చుకున్నాడట.
ఈ సినిమా నీకు ఖచ్చితంగా పేరు తెచ్చి పెడుతుందనిపిస్తుందని అన్నాడట. అందుకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు చెప్పాడు. ఆ టైంలో ప్రభాస్ మూవీకి సంబంధించిన విశేషాలను ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నాడట. మొదటి టీజర్ కు అన్యూహంగా రెస్పాన్స్ వచ్చిన క్రమంలో మిగిలిన రెండు టీజర్ లు త్వరలోనే రిలీజ్ చేస్తారేమో చూడాలి. ప్రభాస్ మంచి కామెంట్స్ చేయడంతో.. యూనిట్ సభ్యులు మరింత జోష్ తో షూటింగ్ చేయాలని భావిస్తున్నారు. ఈ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో హీరోయిన్స్ గా రాశిఖన్నా మరియు నివేదా థామస్ లు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ 120 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసే ఛాన్సులు ఉన్నాయిఅని అంచనా వేస్తున్నారు.
{youtube}_wcs7ixyDbY{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related