స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య‘, సూపర్స్టార్ మహేష్బాబు నటిస్తున్నా ‘భరత్ అను నేను’ ఈ రెండు సినిమాలు నువ్వ నేనా అన్నట్లు తలపడుతన్నాయి. నిన్నటి వరుకు వీళ్ల మధ్య కాంప్రమైజ్ అయింది అని అల్లు అర్జున్ చిత్రం ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలను చిత్ర నిర్మాతలు ఖడించారు.ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. అనుకున్న తేదీ ప్రకారం ఏప్రిల్ 27న విడుదల చేస్తామన్నారు.
అయితే మహేష్ బాబు టీం కూడా ఎక్కడ తగ్గడం లేదు ఓత్ పేరుతో జనవరి 26ని తన సినిమా ప్రమోషన్స్ని మొదలు పెట్టారు. ఈ సినిమా విడుదల కూడా ఏప్రిల్ 27నే అంటున్నారు చిత్ర నిర్మాతలు .ఓపెనింగ్స్ దెబ్బతినకూడదని ‘నా పేరు సూర్య‘ ను ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. వాటన్నింటికి చిత్ర నిర్మాతలు ఫుల్స్టాప్ పెట్టారు.