Saturday, April 27, 2024
- Advertisement -

మహేశ్‌బాబుకు పోటీగా త్రివిక్రమ్ రెమ్యూనరేషన్

- Advertisement -

స్టార్ డైరెక్టర్లలో ఒకరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాక్షన్, కామెడీతో కూడిన కుటుంబ కథ చిత్రాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక త్రివిక్రమ్ డైలాగ్‌లయితే సినిమాల్లో ఓ రేంజ్‌లో పేలుతుంటాయి. నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, s/o సత్యమూర్తి, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో సినిమాలు చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆయనకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే.

స్టార్ హీరోలే ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ‘అల వైకుంఠపురము’లో బ్లాక్‌ బస్టర్ హిట్ కొట్టడంతో త్రివిక్రమ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దాంతో అయన తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను ‘సూపర్ స్టార్’ మహేష్ బాబుతో చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఏకంగా 50 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది.

ఈ సినిమాకి మహేష్ బాబు ఎంత వసూలు చేస్తున్నాడో.. అంతే మొత్తాన్ని త్రివిక్రమ్ కూడా అందుకోవడం విశేషం. అల వైకుంఠపురము సినిమాకు 25 కోట్లు తీసుకున్న మాటాల మాంత్రికుడు.. మహేష్ సినిమాకు తన రెమ్యూనరేషన్‌ డబుల్ చేశారు. ప్రస్తుతం తెలుగులో రాజమౌళి తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుడు త్రివిక్రమ్.

టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

సర్జరీతో మరింత అందం పోందిన హీరోయిన్స్ వీరే…!

ఆ హీరోను ఒంట‌రిగా క‌ల‌వ‌నందుకు సినిమా నుంచి తీసేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -