నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం కల్కి 2898AD. ఈ మూవీపై రోజు బజ్ పెరుగూతనే ఉండగా ఈ మూవీ ద్వారా భారతీయ సినిమా వైభవాన్ని ప్రపంచ వేదికపై చాటేందుకు సిద్ధమవుతోంది వైజయంతి మూవీస్. 2024 జనవరి 12న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్ సినిమాటిక్ మాస్టర్ పీస్ సైన్స్ ఫిక్షన్, అపూర్వమైన స్టొరీ టెల్లింగ్ కలయికగా కొత్త బెంచ్మార్క్లను సెట్ చేస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రేమికుల్లో క్యురియాసిటీని, ఉత్సాహాన్ని క్రియేట్ చేసింది. ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని నటిస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లీకులపై మేకర్స్ ఘాటుగా స్పందించారు. కొద్దిరోజులుగా సినిమా నుంచి లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుండగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు మేకర్స్. స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తూ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. సినిమా నుండి పోస్టర్ లేదా వీడియో ఏదైనా కూడా లీక్ చేసినా, వాటిని స్ప్రెడ్ చేసిన వారి పైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాలో కల్కీ మూవీకి సంబంధించిన లీకులను స్ప్రెడ్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలని పలువురు హెచ్చరిస్తున్నారు.