బాలీవుడ్ లో సంచలన హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్. ముక్కు సూటిగా మాట్లాడటం.. ఎంతటి వారిపైనా అయినా సంచలన వ్యాఖ్యలు చేయడం ఈ అమ్మడికి వెన్నెతో పెట్టిన విద్య. గతంలో కాస్టింగ్ కౌచ్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్యకు బాలీవుడ్ బంధు ప్రీతి అలాగే డ్రగ్స్ మాఫియా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఈ అమ్మడు ‘తలైవి’ మూవీలో నటించిన విషయం తెలిసిందే.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అలనాటి హీరోయిన్ జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘తలైవి’. ఈ సినిమా ఈనెల 23వ తేదీన విడుదల కానుండగా కరోనా తీవ్రత వల్ల సినిమా వాయిదా పడింది. అయితే, కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో చిత్రం విడుదల వాయిదా పడింది. దాంతో ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే విడుదల చేసేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
తాజాగా ఈ మూవీ పై వస్తున్న రూమర్లపై కంగనా రనౌత్ సీరియస్ గా స్పందించారు.. సినిమా థియేటర్ లో విడుదలైన తర్వాతే ఓటీటీ లోకి విడుదల చేస్తామని తెలిపింది. ఈ మూవీ తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్, హిందీ వెర్షన్ నెట్ ప్లిక్స్ లు సొంతం చేసుకున్నాయని తెలిపింది. ఇక దీనిని ఆసరాగా చేసుకుని కొందరు సినిమా విడుదలపై పుకార్లు చేస్తున్నారని తెలిపింది. నిజమేంటో తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రచురించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని కంగన హెచ్చరికలు జారీ చేసింది.
టాలీవుడ్లో విషాదం.. నిర్మాత CN రావు మృతి!