బాహుబలి మూవీ విడుదల అయిన తర్వాత ప్రతి ఒక్కరు లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ? అన్న ప్రశ్న పెద్ద పజిల్గా మారిపోయింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు పొడిచి చంపాల్సి వచ్చింది ? ఈ ప్రశ్నకు ఆన్సర్ కోసం దేశ వ్యాప్తంగా సినిమా జనాలు ఏప్రిల్ 28న విడుదల కాబోయే బాహుబలి 2 కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.సోషల్ మీడియాలో ఎవరికి వారు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ? అన్న ప్రశ్నపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
ఎవరికి తోచినట్టు వారు చర్చించుకుంటున్నారు. బాహుబలిని చంపిన టీమ్లో తెరముందు కనిపించేది కట్టప్పే అయినా, మహిష్మతి రాజుని చంపమని ప్రేరేపించింది మాత్రం ఆ ఇద్దరే అన్నది ఇప్పటి వరకు చర్చకు వచ్చింది. బాహుబలిని చంపేలా సింహాసనానికి కట్టుబానిస అయిన కట్టప్పపై రానా, నాజర్ ఒత్తిడి తెచ్చారన్నదే ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు. భల్లాలదేవని రాజును చెయ్యడానికి నాజర్ పన్నిన కుట్రలో భాగమే ఇదంతా అని చెబుతున్నారు.
కానీ ఇప్పుడు మరో టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. బాహుబలి మర్డర్ స్కెచ్ వెనక ఓ లేడీ ఉందని…ఆ లేడీ ఎవరో కాదు శివగామి మహాదేవీయే అని చర్చలు జరుగుతున్నాయి. శివగామి ఆజ్ఞ మేరకే కట్టప్ప బాహుబలిని చంపాడని, ఆమె కుట్ర తెలిసి తల్లి కోరికని తీర్చడానికి బాహుబలి తన శిరస్సును కట్టప్ప కత్తికి బలి ఇచ్చాడని చెబుతున్నారు. సో బాహుబలిని చంపింది కట్టప్ప అయిన.. వెనక ఉండీ చంపించింది మాత్రం శివగామి అనే కొత్త చర్చ జరుగుతోంది. మరి కట్టప్పని ఎవరు చంపించారు అనేది తెలియాలంటే.. ఏప్రిల్ 28 వరకు వేచి చూడాల్సిందే.
Related