సూపర్ స్టార్ మహేష్ బాబు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి షాక్ ఇచ్చాడు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా చేసాడు. ఆ సినిమా మహేష్కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివతో మరోసారి సినిమా చేసేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. ఇంత వరకు బానే ఉంది.
అయితే కొరటాల శివతో మహేష్ చేసే సినిమాలో ముందుగా చెర్రీని సెలక్ట్ చేశారు. శివ డైరెక్షన్లో ఓ కమర్షియల్ మూవీలో నటించాలని చెర్రీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబోలో సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా మధ్యలోనే నిలిచిపోయింది. దాంతో లేట్ చేయకుండా కొరటాల శివ తో సినిమా చేయాలి అని అనుకున్నాడు. అయితే ఇక్కడే చెర్రీకి సడెన్ షాక్ తగిలింది.
‘జనతా గ్యారేజ్’ తర్వాత చరణ్ తో సినిమా తీస్తాడనుకున్న కొరటాల.. ఇప్పుడు ఉన్నట్లుండి మహేష్ వైపు మళ్లాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో దాదాపు సినిమా ఖాయమైపోయినట్లే. సీనియర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్టులో ముందుగా చెర్రీ హీరో అనుకున్నారు. ఇప్పుడు మహేష్ ఈ ప్రాజెక్టులోకి వచ్చేశాడు. ఈ సినిమా కోసం మహేష్కు దానయ్య రూ.20 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
Related