మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ కు అక్కినేని ఫ్యామిలీలోని అఖిల్ కు చుట్టరికం కలిసింది. ఇద్దరు బావ మరుదులు అవుతారని ఓ కథనం. లేదు ఇంకేదో బంధుత్వం ఉందని కూడా టాలీవుడ్ లో టాక్. వరస ఏదైనా బంధుత్వం మాత్రం పక్కా అయిందని అనుకున్నారు. అయితే మెగా ఫ్యామిలీకి.. అక్కినేని ఫ్యామిలీకి ఎలా చుట్టరికం కుదురింది..? చరణ్ పెళ్లి చేసుకున్న ఉపాసన అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి చెందిన ప్రతాప్ రెడ్డికి స్వాయాన మనవరాలు.
అలా రామ్ చరణ్ అపోలో వారి ఇంటి అల్లుడయ్యాడు. శ్రియా భూపాల్ వ్యాపారవేత్త జీవీకే సంస్థల అధినేత జీవీకే రెడ్డి మనవరాలు. ఇక అసలు విషయంలోకి వస్తే.. ఉపాసన తరుపు నుంచి శ్రియా కుటుంబంకు బంధుత్వం ఉందట. ఉపాసనకు శ్రియా మరదలు వరస అవుతుందని టాలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే ఈ బంధుత్వం ఇప్పుడు కుదరకపోవచ్చు.
అంటే ఉపాసన, శ్రియా ఇద్దరు మరదలు అయితే.. చెర్రీ, అఖిల్ బావ మరుదులు అవుతారు అని అందరూ అనుకున్నారు. కానీ అఖిల్, శ్రియా విడిపోవడంతో.. ఈ అక్కినేని ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి బంధుత్వం కుదరడం లేదు. ఇక మెగా ఫ్యామిలీ వారు.. శ్రియా భూపాల్ ని చేసుకొమని అక్కినేని అఖిల్ ని ఫోర్స్ చేస్తున్నారంట. జరిగిందేదో జరిగింది.. ఎలాగో ఎంఎంగేజ్మెంట్ అయింది కాబట్టి.. పెళ్లి చేసుకొమని అడుగుతున్నారట. మరి మెగా ఫ్యామిలీ అడిగిన తర్వాత కూడా అక్కినేని ఫ్యామిలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
{youtube}GxxxpESNyJ8{/youtube}
Related