ఆసియా ఖండం మొత్తం మీద ఎక్కడా వీరప్పన్ ని మించిన క్రిమినల్ లేనే లేడు అంటూ ఉంటారు. అతను చనిపోయిన తరవాత కూడా అతనిమీద సినిమా తీయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ సమయం లో వీరప్పన్ గురించి ఎవరో పుస్తకం రాయబోతే వివాదాస్పదం కూడా అయ్యింది. వీరప్పన్ బతికే ఉన్నాడు అంటూ అప్పట్లో చాలా గోల చేసారు కూడా.
అలాంటి వీరప్పన్ మీద ఏకంగా సినిమా తీసేసాడు రాం గోపాల్ వర్మ. సంచలనాలకి మారు పేరైన వర్మ కిల్లింగ్ వీరప్పన్ అంటూ పేరు పెట్టిన ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ్ ,హిందీ భాషల్లో విడుదల అయ్యింది. ఈ సినిమా కోసం కాపీరైటు కింద వీరప్పన్ భార్య డబ్బు తీసుకుంది అంటున్నారు. వీరప్పన్ చిత్రం కాపీరైట్ కోసంరూ.25క్షలు తీసుకున్న ముత్తులక్ష్మి.. ఇప్పుడు రాంగోపాల్ వర్మ మీద పలు ఆరోపణలు చేస్తున్నారు.
మరింత డబ్బు తీసుకొని కూడా ఎందుకలా విమర్శలు చేస్తున్నారంటూ అన్న ప్రశ్నలకు ముత్తు లక్ష్మి బదులిస్తూ.. అగ్రిమెంటు పేపర్లలో ఏం ఉందో కూడా చెప్పకుండా సంతకాలు తీసుకున్నారని ఆమె చెబుతున్నారు. అవగాహన లేక తాను సంతకాలు చేసినట్లుగా చెబుతున్న ముత్తులక్ష్మి.. ఈ సినిమా తమిళ వెర్షన్ ను తానే విడుదల చేయాలని అనుకున్నానని.. కానీ రాంగోపాల్ వర్మ మాత్రం తనకిచ్చిన మాటను తప్పినట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. మరి.. ముత్తులక్ష్మి ఆరోపణలకు ఆర్జీవీ రియాక్ట్ అవుతారా..?
Related