జబర్దస్త్ షోతో కొన్ని అభిప్రాయబేధాలు రావడంతో నాగబాబు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. జబర్దస్త్ షో లాంటిదే అదిరింది షోని జీతెలుగు వారు ప్రారంభిస్తే అందులోకి నాగబాబు జడ్జిగా వెళ్ళారు. అలానే నవదీప్ మరో జడ్జీగా.. రవి యాంకర్ గా పని చేశారు. అయితే చాలా ప్రయత్నాలు చేశారు కానీ జబర్దస్త్ ను బీట్ చేయడంలో మాత్రం అదిరింది షో వెనుకబడిందని చెప్పాలి. ఇక ఈ షోలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ని ఇమిటేట్ చేస్తూ స్కిట్ చేయడం కూడా పెద్ద వివాదం అయింది.
తాజాగా ఈ షోకి పేరు మారుస్తూ బొమ్మ అదిరింది పేరిట షో చేస్తున్నారు. యాంకర్ శ్రీముఖి, సుమ కనకాల, జానీ మాస్టారు ఇలా కొత్తవాళ్లతో సందడి చేస్తున్నారు. అయితే ఇప్పుడు నవదీప్ బయటకు వచ్చేయడం వెనుక నాగబాబు హ్యాండ్ ఉందా లేక మరే కారణాలు అయిన ఉన్నాయా అనేది తెలియడం లేదు. యాంకర్ రవి, భానుశ్రీలను తొలగించి శ్రీముఖిని తీసుకున్నారు. అలాగే జడ్జి ప్లేస్ లో ఉన్న నవదీప్ ని తీసేసి జానీ మాస్టర్ ని తీసుకున్నారు.
అయితే కొత్తగా వస్తున్న జబర్దస్త్ లో నవదీప్ దర్శనమిచ్చాడు. ఇది చూస్తుంటే, షో మారడం వెనుక చాలా తతంగం జరిగి ఉంటుందని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇక యాంకర్ రవి కూడా అదే షోలో కన్పిస్తున్నాడట. అంతేకాదు దసరా స్పెషల్ సందర్బంగా ఎవరే అతగాడు షోలో యాంకర్ రవి రచ్చరచ్చ చేస్తున్నాడు. ఈటివి దసరా సందర్బంగా ప్రసారం చేయనున్న ఈ షోలో నవదీప్ కూడా నవ్వుతూ కనిపించాడు. మొత్తానికి ఏదో విషయంలో తేడా జరిగి ఉంటుంది అందుకే నవదీప్, యాంకర్ రవి బొమ్మ అదిరింది నుంచి బయటకు వచ్చారని టాక్.
బాలీవుడ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడంలో ప్రభాస్ ఉద్దేశ్యం ఏంటి..?
మహేష్ బాబుకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?
