Sunday, April 28, 2024
- Advertisement -

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న మరో వారసురాలు.. ఎవరంటే?

- Advertisement -

సినిమా ఇండస్ట్రీ అన్నాక ఎంతోమంది నటీనటులు వస్తుంటారు వెళుతుంటారు.కొందరు చిరస్థాయిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు మరికొందరు అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి వెను తిరుగుతుంటారు. కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం తమ వారసులని ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్ల పిల్లలు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తాజాగా ఇండస్ట్రీలోకి తన సత్తా చాటుకోవడానికి కోసం మరో వారసురాలు ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఆమె మరెవరో కాదు ఒకప్పుడు మెగాస్టార్ సరసన ఎంతో అద్భుతంగా నటించి మంచి విజయాలను పొందిన వాణి విశ్వనాథ్ సోదరి ప్రియా విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్. వర్ష కేరళ లోని త్రిసూర్ లో ఇంటర్ విద్యను పూర్తి చేసారు. ఇప్పటికే.. ఆమె మూడు సినిమాలలో నటించారు. తాజాగా తెలుగులో వర్ష “రెడ్డి గారింట్లో రౌడీయిజం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.

Also read:సుడిగాలి సుధీర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న గెటప్ శ్రీను.. ఏం చేశాడంటే?

తెలుగులో ఈ సినిమా విడుదల కాకుండానే వర్ష మరో రెండు సినిమాలకు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది.వట్టికూటి చంద్ర డైరెక్షన్ లో ఆమె ఓ సినిమా లో నటించనున్నారు. ఈ సినిమాలో రమణ్ హీరోగా నటించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి తనయుడు
రాజీవ్ సాలూరితో మరో సినిమా చేయనున్నారు.సినిమా ను శిరీష రెడ్డి నిర్మించనున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్స్ ను ఖరారు చేయలేదు.త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలను అధికారికంగా విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి వర్షా తెలుగు ప్రేక్షకులను ఏ ఈ విధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

Also read:లైవ్ లో ఆ విషయాలను చెప్పేసిన అభిజీత్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -