కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ లు ఇప్పటికే మూడు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు మూడూ సూపర్ హిట్ లే కావడం గమనార్హం.
బృందావనం , బాద్షా , టెంపర్ సినిమాల్లో వీరు ఇద్దరూ మంచి జంటగా కనిపించరు, డాన్స్ విషయం లో కూడా ఎన్టీఆర్ కి మంచి పోటీ ఇస్తుంది కాజల్ అని ఒక టాక్ కూడా ఉంది.
బాక్స్ ఆఫీస్ దగ్గర వీరి కాంబినేషన్ కి మంచి గిరాకీ కూడా ఉంది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ గురించి మాట్లాడిన కాజల్ తానూ జీవితం లో ఇప్పటి వరకూ చూసిన వారి లో చాలా నిజాయతీ పరుడు ఎన్టీఆర్ మాత్రమె అని ప్రకటించింది. తాను చాలా తక్కువ మందిని అంత పారదర్సికంగా ఉండడం చూసాను అని ముక్కుసూటిగా
మాట్లాడి మాటమీద నిలబడే వ్యక్తుల్లో ఎన్టీఆర్ కీ వారూ సాటి రారు రాలేరు అని ఆకాశానికి ఎత్తేసింది కాజల్. అలాంటి ముక్కుసూటి మనుషులు అంటే తనకి చాలా ఇష్టం అని కూడా చెప్పేసింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ సుకుమార్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండగా, కాజల్ తన గబ్బర్ సింగ్ సీక్వెల్ లో బిజీ గా ఉంది.