యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వరసగా మూడు వరస హిట్స్ రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పేరిగిపోయింది. ఎన్టీఆర్ ప్రస్తుతం.. బాబీ దర్శకత్వంలో జై లవ కుశ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇటివలే ప్రారంభం అయింది. ఎన్టీఆర్ కూడా ఇటివలే షూటింగ్ లో పాల్గొన్నాడు.
అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. అందుకే ఈ సినిమాకి జై లవ కుశ అనే టైటిల్ పెట్టారు. అంటే జై, లవ, కుశ అనే మూడు పాత్రలు అనమాట. అయితే ఈ మూడు పాత్రలో రెండు పాత్రల్లో ఎన్టీఆర్ అన్నదమ్ములుగా నటించబోతున్నాడు. అయితే అందులో ఒకటి పాజిటివ్ ఉన్న పాత్ర.. మరోకటి నెగిటివ్ ఉన్న పాత్ర కావడం విశేషం. ఇద్దరు అన్నదమ్ముల మధ్య కొన్ని సన్నివేశాల్లో తిట్టుకోవడంతో పాటూ.. కొట్టుకుంటారంట. సో జై లవ కుశ ఎన్టీఆర్ హీరోగా.. విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఓ రోల్ సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్. వచ్చే ఏడాది కానీ.. ఈ ఏడాది చివరిలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ హీరోయిన్ గా రాశి ఖన్నని తీసుకున్నారు. ఇంకో హీరోయిన్ కోసం అన్వేశిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
{youtube}Ld5LjNR1SVE{/youtube}
Related