టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా కొనసాగిన వేణు మాదవ్ గత కొంత కాలంగా సినిమాలకు దూరమయ్యారు. వేణు ఆరోగ్యం బాగాలేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్లని ఫ్యామిలీతో హాయిగా గడిపానని అందుకే సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చిందని.. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నానని వేణు అంటున్నారు.
ఈ సందర్భంగా మీడియతో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. వేణుమాధవ్ సినిమాల్లోకి రాకముందు తెలుగుదేశం పార్టీలో టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేసేవాడు. ఒక్కో టైంలో తనకు నైట్ డ్యూటీలు కూడా పడేవంట. ఆ టైంలో ఓ సంఘటన తనకు ఎదురైందట. ఒక రోజు రాత్రి ఎన్టీఆర్ ఇంటివద్ద డ్యూటీ పడిందట..అయితే ఎన్టీఆర్ గదిలో లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాడట..ఇది గమనించిన ఎన్టీఆర్ ఇక్కడ డ్యూటీ చేస్తుంది ఎవరూ అని ఆరా తీయగా వేణుమాధవ్ అని తెలిసిందట.
దాంతో వెంటనే వేణు మాధవ్ ని పిలిపించి.. గట్టిగా మండలిచడమే కాకుండా.. వెనక్కి తిరిగమని చెప్పి ఒక తన్ను తన్నాడట. ఎన్టీఆర్ కోపాన్ని అప్పటీ వరకు తాను చూడలేదని వేణు అన్నాడు. బాధపడుతూ కూర్చుకున్న వేణు మాధవ్ వద్దకు ఎవరో వచ్చి ఎన్టీఆర్ పిలుస్తున్నాడు అంటూ లోపలకు తీసుకెళ్లారట. అప్పుడు ఎన్టీఆర్ తింటున్న దోష లో కొంత భాగం ఇచ్చి తినమని చెప్పడమే కాకుండా బాద్యతాయుతంగా ఉండమని చెప్పాడట. ఇక సినిమాలకు దూరంగా ఉన్న వేణు త్వరల్లోనే మళ్లీ సినిమాలతో బిజీ అవుతాను అని చెప్పుతున్నాడు.
{youtube}d_s0wlaTtcs{/youtube}
Related