స్పైడర్ సినిమాతో విజయం అందుకున్న మహేశ్బాబు భరత్ అను నేను అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి సినిమాకు అంగీకరించాడు. అయితే ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మహేశ్ సరసన పూజా హెగ్డేను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. పూజా హెగ్డే గతంలో దువ్వాడ జగన్నాథం (డిజే), ముకుంద సినిమాల్లో నటించింది. డీజేలోనైతే అందచందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీ వాసు దర్శకత్వంలో తీస్తున్న సినిమాలో నటిస్తోంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ సినిమాను హిట్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో అల్లరి నరేశ్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. భారీగా తెరకెక్కబోయే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర బృందం.