బాహుబలి 2 మూవీ రికార్డులను సృష్టించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సాహో అనే సినిమా చేయస్తున్నాడు. ఇప్పుడు ఈ టీజర్ స్టోరీ లీక్ అయ్యింది. సుజీత్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా గురించి ప్రభాస్ బాహుబలి-2 ప్రమోషన్స్ టైంలో కూడా చెపుతున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ని బాహుబలి-2తో పాటే థియేటర్స్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడు. ఆ దెబ్బతో సాహోకి బాహుబలి క్రేజ్ పూర్తిగా ఉపయోగడాలన్నది ఐడియా.
అయితే ఇప్పుడు ఆ టీజర్ స్టోరీ కాస్తా లీక్ అయింది. ఈ మూవీ జేమ్స్బాండ్ తరహాలో ఉంటుందని సమాచారం. పోలీస్గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఇక ఈ సాహో టీజర్ ఏంటంటే… నలుగురు అమ్మాయిలు నేల మీద పడి ఉంటారు. ఆ అమ్మాయిల నుంచి అలా కెమేరా పాన్ చేస్తే భారీ భారీ బిల్టింగ్స్….లావిష్ రోడ్స్ మీదుగా హీరో కంటిలోకి ఎంటర్ అవుతుంది. రివీల్ చేస్తే జేమ్స్ బాండ్ స్థాయి బిల్డప్తో హీరో రివీల్. ఆ అమ్మాయిలున్న లొకేషన్లోనే హీరో ఉంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన విలన్…‘ఇంత రక్తం చూస్తుంటే మనవాళ్ళు వీడిని బాగానే కొట్టినట్టుందే…..’ అన్న డైలాగ్ చెప్తాడు.
‘ఆ రక్తం మనవాళ్ళు కొడితే వచ్చింది కాదు సార్…..వాడు మనవాళ్ళను కొడితే వచ్చింది….’ అని విలన్ మనిషి విలన్తో చెప్తాడు. అప్పడు రక్తం తుడుచుకుంటూ లేస్తాడు హీరో. ‘ది గేమ్ స్టార్ట్స్ నౌ’ అన్న పంచ్ డైలాగ్ చెప్తాడు. ఆ వెంటనే అతని రెండు చేతులకు రెండు విమానపు గాడ్జెట్స్ లాంటివి వస్తాయి. ఆ తర్వాత అక్కడే ఉన్న ఎత్తైన బిల్టింగ్ పై నుంచి జంపింగ్స్ చేస్తాడు. ఇదే టీజర్ కాన్సెప్ట్. అయితే ఇంత సింపుల్గా ఉందేంటి అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ టీజర్లో గ్రాఫిక్స్ వర్క్ మామూలుగా ఉండదట. ఇంచుమించుగా జేమ్స్ బాండ్ తరహా మూవీ స్టైలో ఉంటుందని సమాచరం. సినిమా అంతా హాలీవుడ్ స్థాయి లో ఉంటుందని తెలుస్తోంది.
{youtube}PNTxya3u2QY{/youtube}
Related