Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ తో కూతురు ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్

- Advertisement -

పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత రేణూ దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. పవన్ నుంచి విడాకులు తీసుకున్న మెగా అభిమానులు మాత్రం ఆమెను అభిమానిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వైపు నుంచి వచ్చే అభిమానాన్ని ఆదరణను రేణు దేశాయ్ ఇష్టపడటం లేదు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పేరును కూడా ఎత్తడానికి ఇష్టపడటం లేదు రేణుదేశాయ్.

అయితే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజున తన మాజీ భర్త ఫోటో పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కూతురు ఆధ్యాతో పవన్ కళ్యాణ్ దిగిన ఫోటో అది. పిల్లలు లక్షణాలు తల్లిదండ్రుల నుంచి చాలా విడ్డూరంగా అందంగా పొందుతారు. కొన్ని సార్లు ఈమె చూడటానికి అచ్చం నాలాగే ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళ నాన్నమ్మ, నాన్నను కాఫీ లా అనిపిస్తుంది. అధ్యా నా కెమెరాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని రేణు దేశాయ్ తన పోస్టులు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే మొన్నీమధ్య కొడుకు అకీరా తన చెల్లెలు ఆధ్యాను ఎత్తుకొని ఉన్న ఫోటోని పోస్ట్ చేశారు రేణు దేశాయ్. మీరు ఒకటి రెండు మూడు లెక్కబెట్టేలోపు నేను నీ ముందు ఉంటా అని అకీరాను ఆధ్యా ఉద్దేశించి పోస్ట్ లో పేర్కొన్నారు. అంతే కాదు వీరిద్దరు నా సొంతం అని కూడా రేణు దేశాయ్ పేర్కొన్నారు. అయితే ఈ ఫోస్ట్ పై కొంతమంది పవన్ ఫ్యాన్స్ విమర్శలు వ్యక్తం చేశారు. ఎంతైన వాళ్లలో ఉంది పవన్ రక్తం కదా అని కామెంట్ చేశారు.

ఈ కామెంట్ కు వెంటనే వారికి కౌంటర్ ఇచ్చింది రేణు. సైన్స్ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. సైన్స్ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అని ఘాటుగా రిప్లై ఇచ్చారు రేణుదేశాయ్. అయితే ఇంత ఘాటు రిప్లేయ్ ఇచ్చిన రేణు.. ఇప్పుడు పవన్ ఆధ్యాల ఫోటోను పోస్ట్ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -