Wednesday, May 8, 2024
- Advertisement -

టాలీవుడ్ లో అడుగుపెడుతున్న శ్రీదేవి చిట్టి కూతురు..?

- Advertisement -

అలనాటి స్టార్ హీరోయిన్, వెండితెర అతిలోకసుందరి శ్రీదేవి, బోనీకపూర్ ల చిన్న కుమార్తె ఖుషీ కపూర్ తాజాగా సినీరంగ ప్రవేశం చేయడానికి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. ఈ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ కాదని టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైందట. ఆమె తండ్రి బోనీకపూర్ కూడా ఖుషీ కపూర్ ను టాలీవుడ్ల్లో హీరోయిన్ గా పరిచయం చేయడానికి ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారట.

ప్రస్తుతం ఖుషీ కపూర్ తన చదువును ముగించుకొని లండన్ లో యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు.ఒక వేళ ఈ వార్త నిజమైయితే టాలీవుడ్ లో ఖుషి కపూర్ నటించే తొలిసినిమా అనౌన్స్ మెంట్ త్వరలోనే వచ్చే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీలు జోరుగా ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ఖుషీ కపూర్ ను హీరోయిన్ గా పరిచయం చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏమి లేదు.

Also read:పుష్పకు అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్.. వింటే ఉగిపోవాల్సిందే?

ఇదిలా ఉండగా శ్రీదేవి, బోనీకపూర్ ల పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో మొదటి సినిమా ‘ధడక్’తో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. తాజాగా టాలీవుడ్లో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూవీలో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Also read:బాలయ్య పుట్టిన రోజుకు పెద్ద గిఫ్ట్.. ఏంటంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -