అక్కినేని కుటుంబం నుంచి సుశాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన దశాబ్ధ కాలం కెరియర్లో కేవలం మూడు చిత్రాల్లో మాత్రమే నటించాడు. కాళిదాసు-కరెంట్-అడ్డా మూడు సినిమాలు సుశాంత్ కేరీర్కు ఏ మాత్రం ఉపయోగపడలేకపోయాయి. అడ్డా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుశాంత్ ‘ఆటాడుకుందాం రా ‘ సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం కూడా ఊహించనంతగా లేదు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రచారంలో భాగంగా సుశాంత్ చేసిన కామెంట్స్ నాగార్జునకు షాక్ ఇచ్చినట్టు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. అక్కినేని ఫ్యామిలీ చిత్రం మనం లో కూడా తాను ఉంటే బాగుండేది తాను లేకుండానే మనం సినిమా తీశారంటూ తన మనసులోని మాట బయట పెట్టాడు.
అయితే అది కేవలం అక్కినేని హీరోల సినిమానే కాబట్టి నాగ్ సుశాంత్ , సుమంత్ లను తీసుకోలేదు లేదంటే వారు కూడా సినిమాలో భాగమయ్యే వారు. మొత్తానికి మనం సినిమా విషయంలో సుశాంత్ బాగానే హార్ట్ అయ్యాడు.
Related