అందాల నటి త్రిష ముఖ్య పాత్రలో నటించిన చిత్రం నాయకి ఇటివలే రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రానికి నిర్మాత త్రిష మేనేజర్ కావడం విశేషం. అయితే ఈ చిత్రంలో నటించేందుకు త్రిష భారీ రెమ్యునరేషన్ అడిగిందట. అందుకు నిర్మాత తమిళ రైట్స్ మొత్తం త్రిషకే కేటాయించారట. అయితే సినిమా అనుకున్న టైంకి రిలీజ్ కాకుండా పోస్ట్ పోన్ అవడం, అనుకున్న బడ్జేట్ కన్న ఎక్కువ ఖర్చు అవ్వడం, సినిమా రిలీజ్ అయిన ప్లాప్ టాక్ రావడం జరిగింది.
ఇక తమిళ రైట్స్ కూడా అనుకున్నంతగా రాలేదట. ఇక తనకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా సినిమా విడుదల చేయకుడదు అని త్రిష పెట్టిన నోటీసు కోర్ట్ లో సబ్మిట్ అవ్వలేదట. ఇంకేముందు జరగాల్సినదంతా జరిగింది. అయితే నిర్మాత తమిళ రైట్స్ కు వచ్చిన మొత్తం త్రిషకు ఇస్తాం అంటున్నాడు. సినిమాకి ప్లాప్ టాక్ రావడంతో కొంత లాస్ వచ్చిందట.
అందుకే త్రిష నాయకి ప్రొడ్యూసర్ గిరిధర్ మీద గుస్సుగా ఉంది. ఇక త్రిషతో నాయకి అంటూ హర్రర్ కామెడీ చూపిద్దామనుకున్న గోవి సినిమా మొత్తం అడ్డదిడ్డం చేసి ఆ మాత్రం వసూళ్లు కూడా లేకుండా చేశాడు. మరి త్రిష కి రావాల్సిన అమౌంట్ ఏ రూపంలో రికవర్ చేసుకుంటుందో త్రిషకే తెలియాలి. ఈ తతంగమంతా చూస్తూంటే నిర్మాత చేతిలో త్రిష మోసపోయిందని అర్ధమవుతుంది.
Related