ఊర్వశి రౌటేలా…సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఐటెం సాంగ్స్కు కేరాఫ్ ఈ భామ. రీసెంట్గా చిరంజీవి హీరోగా చేసిన వాల్తేరు వీరయ్య మూవీలో బాసూ వేర్ ఈజ్ ద పార్టీ అనే పాటతో సౌత్ లో ఫేమస్ అయింది ఈ బాలీవుడ్ భామ. బ్రో, స్కంద,ఏజెంట్ వంటి సినిమాలలో కూడా స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇదే ప్లేస్లో ఏ అప్కమింగ్ హీరోయిన్ ఉన్న ఎగిరి గంతేసి మరి సినిమాలకు ఓకే చెబుతుంది. కానీ ఈ భామ మాత్రం తనకు ఐటెం సాంగ్సే ముందు హీరోయిన్ ఛాన్స్ వద్దు అని తేగేసి చెబుతుందట.
ఇందుకు కారణం లేకపోలేదని చెబుతోంది ఈ భామ. చిన్న చిన్న సినిమాల్లో నటించడం కంటే పెద్ద హీరోలతో పెద్ద నిర్మాతల బ్యానర్లో ఐటెం సాంగ్ చేయడం వల్లే ఎక్కువ గుర్తింపు రావడమే కాదు ఇన్కమ్ కూడా వస్తుందని తెలిపింది. ఇక సినిమాల్లో హీరోయిన్గా నటిస్తే మూవీ హిట్ అయితే ఓకే లేకపోతే ఉన్న ఐటెం సాంగ్స్ అవకాశాలు కూడా పోతాయని చెబుతోందట. అలాగే హీరోయిన్గా ఛాన్స్ దక్కితే ఎక్కువ రోజులు సినిమా కోసం పనిచేయాల్సి ఉంటుంది. అదే ఐటెం సాంగ్స్ అయితే ఒకటి లేదా రెండు రోజులు అంతకమించి ఉండదు. డబ్బుకు డబ్బు వస్తుందని చెబుతోంది. అందుకే కొంతమంది నిర్మాతలు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధపడ్డా ఊర్వశీ మాత్రం నో అనే చెప్పిందట. ఇప్పుడు ఈ బ్యూటీ తీసుకున్న నిర్ణయం దక్షిణాదిన చర్చనీయాంశంగా మారింది.