బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మెల్లగా టాలీవుడ్లో స్పెషల్ సాంగ్స్ క్వీన్గా మారుతోంది. బాలీవుడ్లో నటించి దాదాపు దశాబ్దం అవుతున్నప్పటికీ పెద్దగా హిట్లు లేవు. కానీ తెలుగులో ఒక పాట ఆమెను స్పెషల్ సాంగ్స్ కోసం మోస్ట్ వాంటెడ్ నటిగా మార్చింది. మెగాస్టార్ చిరంజీవి వాల్టెయిర్ వీరయ్యలో ఊర్వశి రౌతేలా బాస్ పార్టీ సాంగ్ పెద్ద హిట్ అయ్యింది.
మరో పక్క రామ్, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోని స్పెషల్ సాంగ్లో కూడా ఊర్వశి రౌతే కనిపించనుంది. అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ ల బ్రో ది అవతార్ సినిమాలో కూడా ఒక ప్రత్యేక పాట చేస్తున్నాట్టు సమాచారం. దీంతో ఊర్వశి రౌతే టాలీవుడ్లో స్పెషల్ సాంగ్స్ క్వీన్గా మారిపోతుంది.
ఇటీవలే ఊర్వశి రౌతేలా ముంబైలోని సంపన్నమైన జుహు పరిసరాల్లో RS 190 కోట్ల విలువైన విలాసవంతమైన నాలుగు-అంతస్తుల బంగ్లాలోకి మారారు.