కొంత కాలంగా వేణు మాధవ్ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే.. వేణు సినిమాలు చేయకపోవడానికి కారణం అతని ఆనరోగ్యం అని సోషల్ మీడియాలో తెగ వార్తలు హల్ చల్ చేశాయి. అయితే కొన్ని వెబ్ సైట్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, బతికి వున్నవాళ్లను చనిపోయినట్లు ప్రకటిస్తున్నాయి.
దీంతో సదరు వ్యక్తులు ఆవేదన చెందడమే కాదు, వాళ్ళ కుటుంబసభ్యులు అనారోగ్యం పాలవుతున్నారు అంటూ.. వేణు మాధవ్ వాపోయాడు. బ్రతికున్న నన్ను కొన్ని వెబ్ సైట్లు చనిపోయాడంటూ వార్తలొచ్చాయి. ఒక ఛానల్, కొన్ని వెబ్ సైట్స్ తాను చనిపోయానని వార్తలు ప్రచురించాయని ఆ ప్రతులను చూపిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ వార్తలతో తన తల్లి అనారోగ్యం పాలైందని, తన ఫ్యామిలీ మెంబర్స్ కు, తనకు ఎంతో మనోవ్యధను మిగిలుస్తున్నాయన్నాడు. ఇలాంటి రూమర్లను అరికట్టాలంటూ గవర్నర్ ను కలిసి ఫిర్యాచేశానన్నారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వపెద్దల్ని కూడా కలిసి తనకు న్యాయంచేయాలని కోరతానన్నారు.
{youtube}0yioWC3khIg{/youtube}
Related