ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ రవి, శ్రీముఖిలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. వీరి కలిసి చేసిన ఏ షో అయిన సూపర్ హిటే. అలానే వీరిపై ఎన్నో పుకార్లు షికార్లు చేసాయి. వాటిలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం పక్కన పెడితే.. మరో సారి వీరిద్దరిపై నర్స్ సంఘం అధ్యక్షురాలు ఫైర్ అయ్యింది.
ఈటీవీ ప్లస్ కామెడీ ఛానెల్ లో పటాస్ ప్రోగ్రాం ఇటీవల ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఇది ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ పోగ్రాం కాబట్టి అందులో ఆడియన్స్ ని నవ్వించేవారు రోజూ ఒక కొత్త టాపిక్ తీసుకొని నవ్విస్తూ ఉంటారు. అలానే మార్చి 4న నర్సులను కించపరిచేలా వారిద్దరూ షో చేసారట. ఆ వ్యాఖ్యలు చేసినందుకు గానూ హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. వారిద్దరిపై సంఘం ప్రధాన కార్యదర్శి సుష్మిత మండిపడింది.
వీరిద్దరూ ఎప్పుడూ ఆసుపత్రికి వెళ్లలేదా? అని ఆమె ప్రశ్నించింది. వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రిలో నర్సులతో చికిత్స చేయించుకోలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రవి, శ్రీముఖిలు బయటకొస్తే ప్రతి ఒక్క నర్సు చెప్పు తీసుకొని కొడుతుందని హెచ్చరించింది. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి, తాము ఎంతో సేవ చేస్తామని… అలాంటి తమను అవహేళన చేసిన వారిని చెప్పులతోనే కొడతామని తెలిపింది. రవి, శ్రీముఖిలు తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
{youtube}Ph8vGEeuOXk{/youtube}
{youtube}30BpJQgkGVs{/youtube}
Related