Thursday, May 16, 2024
- Advertisement -

రోజా షోపై షాకింగ్ కామెంట్స్ చేసిన యండమూరి

- Advertisement -

ఇప్పుడు బుల్లి తెరపై రచ్చబండ షో హాట్‌ టాపిక్‌ అయ్యి కుర్చుంది. ఈ కార్యక్రమంలో రోజా.. జబర్ధస్త్ లా నవ్వుతూ కనిపించడానికి వీల్లేదు. అసలే ఎమ్మెల్యే.. కావడంతో ఈ షోకి మంచి రెటింగ్స్ వచ్చాయి. అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. షో కి వచ్చేవాళ్ళు దంపతులేనా? లేదంటే దబ్బులిచ్చి పిలిపిస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి షోలో చేసిన సుమలత, జీవిత రాజశేఖర్ ఇద్దరూ రకరకాల విమర్శలతో తప్పుకున్నారు. ఒక షో కి రానన్నఒక భర్తని, జీవితా రాజశేఖర్ అనుచరులు బెదిరించినట్టుగా కూడా సమాచారం ఉంది. ఈ ఘటనలో పోలీసులు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ షో ద్వారా ఎక్కువ పాపులరిటీ.. రెమ్యునరేషన్ వస్తుండటంతో.. ఈ షో ఒప్పుకుంది రోజా. నాలుగు గోడల మధ్య జరగాల్సిన గొడవను, షో పేరుతో నాలుగు కోట్ల మంది చూసేలా వాళ్ల పరువును రోడ్డుకు తెప్పిస్తున్నారు అని రోజాపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే నిజంగా ఈ షోస్ ద్వారా కాపురాలని చక్కబెడుతున్నారన్న విషయాన్ని పక్కన పెడితే ఒక ఇంటి పరువును బజారుకీడుస్తున్నారనే విషయం ఖచ్చితంగా చెప్పొచ్చు. అన్న విమర్శలనుంచీ అసలు ఇలాంటి టీవీ షోలని రద్దు చేసేయ్యాలనే వాదన కూడా పైకి వచ్చేదాకా వెళ్ళింది. అయితే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఈ షోల గురించి మాట్లాడుతూ.. మానసికంగా ఆనందంగా ఉండే వాళ్లెవ్వరూ ఇలాంటి షోలు చూడాల్సిన అవసరం లేదని అన్నారు. మానస వికాస నిపుణుడిగా తనకున్న అనుభవంతో టీవీ ఛానెల్స్ కు ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్నా ఇలాంటి టీవీ షోలను ప్రసారం చేయవద్దని సూచిస్తున్నానని చెప్పారు. అదే సమయంలో ప్రేక్షకులు కూడా ఇటువంటి చెత్త ప్రోగ్రామ్ లను చూడకుండా ఉంటే రేటింగ్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో వారు సంప్రదించే సైకియాట్రిస్ట్ లందరూ తనకు ఫ్రెండ్సేనని చెప్పారు. టీవీ షోలలో తీర్పు ఇచ్చే స్థానంలో ఓ కుక్కను కూర్చోపెట్టినా అది తీర్పిచ్చేస్తూ ఉంటుందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ షో ల ఉద్దేశం ‘శవాల మీద డబ్బులు ఏరుకోవడమే’ అంటూ తన అబిప్రాయంను తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -