పెద్ద నోట్ల రద్దు వ్యవహారం లో ఎవరికి ఏది అనిపిస్తే చెబుతున్నారు అందరూ. సామాన్యుల సంగతి పక్కన పెడితే దేశ ఆర్ధిక వ్యవస్థ ని ఎన్నో దశాబ్దాలుగా అబ్జర్వ్ చేస్తున్న నిపుణుల మాటలు కూడా మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండడం ఆలోచించాల్సిన విషయం. రతన్ టాటా – అతిపెద్ద పారిశ్రామిక వేత్త అయిన ఈయన కూడా మోడీ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.
పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని – నిత్యావసరాలకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ముఖ్యంగా – వైద్యపరమైన అవసరాలకు సరైన సమయంలో వారికి డబ్బులు అందడం లేదన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఒక ప్రకటన విడుదలచేశారు. నల్లధనం భారీగా పోగేసుకున్న బడా పారిశ్రామికవేత్తలుకూడా ఈవిషయంలో కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనకుండా నిర్ణయాన్ని స్వాగతిస్తున్న క్రమంలో టాటాలు మాత్రం ప్రజల ఇబ్బందులపై నిర్మొహమాటంగాస్పందించడం విశేషం.