- Advertisement -
కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే జార్ఖండులో మావోయలు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. కెల్లా సమీపంలో వెళుతున్న భద్రతా సిబ్బంది కాన్వాయ్ లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ బాంబును ఈ తెల్లవారు జామున పేల్చారు. ఈ ఘటనలో 11 జవాన్లకు గాయపడ్డారు .క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విమానాల్లో రాంచీలోని ఆస్పత్రులకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఘటనా ప్రాంతంలో సహాక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. జార్ఖండ్లో నక్సల్స్ ఏరివేతకు భద్రతా సిబ్బంది, పోలీసులు చేపట్టిన ఆపరేషన్కు ప్రతీకారంగానె మావోయుల ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లలో భద్రతా దళాలపై జరిగిన రెండో అతిపెద్ద దాడి ఇదే. ఘటనా స్థలంలో భారీగా మోహరించిన బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.