ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరో సారి రెచ్చిపోయారు. భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ తో దాడికి తెగబట్టారు. ఈ దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో మంగళవారం మావోస్టులు భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపై ఐఈడీ బాంబుతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరందరిని సమీప ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
కాగా, ఈ మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ నిర్వహించి.. భద్రతా సిబ్బంది తిరిగి వస్తుండగా ఈ పేలుడు జరిగిందని ఛత్తీస్ గఢ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీఎం అవాస్థీ వెల్లడించారు. బస్సులో మొత్తం 20 మందికి పైగా భద్రతా సిబ్బంది ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారనీ, వారికి చికిత్స అందించడం కొరకు రాయ్పూర్ కు తరలించామని చెప్పారు.
ఈ ఘటనపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో కరోనా పంజా.. రేవంత్ రెడ్డికి పాజిటివ్ !
మెగాస్టార్ దూకుడు.. సోనాక్షితో రోమాన్స్ !
ఏపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు