దేశ వ్యాప్తంగా అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, నేరాలకు పోలీసలు చర్యలు తీసకుంటున్నా అత్యాచారం, హత్యలు తగ్గుముఖం పట్టడంలేదు. మైనర్ బాలురు అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇటాంటి సంఘటనే మరో కట వెలుగులోకి వచ్చింది.
15 సంవత్సరాల వయసున్న ఓ బాలుడు 25 ఏళ్ల యువతిపై అత్యాచారం చేయడంతో పాటు ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన పుదుచ్చేరిలో తీవ్ర కలకలం రేపుతోంది. ఆ అమ్మాయికి అప్పటికే జనవరి 27న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ సంఘటన జరగడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఓ బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగినిగా ఉన్న యువతి, ఒంటరిగా నివసిస్తుండగా, ఆమెకు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఈ నెల 18న ఆ ఇంటి నుంచి మూలుగుల శబ్దం వినిపించగా, పక్కింటి వారు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో, మెడపై గాయాలతో పడివున్న సదరు యువతి కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మరణించింది.
పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం చేయించగా, ఆమెపై అత్యాచారం జరిగిందని తేలింది. దీంతో హత్య కేసుగా నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అనుమానంతో పక్కింటి బాలుడిని ప్రశ్నించగా, అనుమానాస్పద సమాధానాలు చెప్పాడు. దీంతో తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం కక్కాడు.
బాలుడు పెంచుకుంటున్న పావురం 18వ తేదీన అది ఎగురుకుంటూ పక్కింట్లోకి వెళ్లింది. దాన్ని తెచ్చుకోవడానికి ఒక్క ఉదుటున ఆ ఇంట్లోకి వెళ్లిన బాలుడిని, ఎందుకు వచ్చావంటూ ఆ యువతి కొట్టింది. ఆగ్రహానికి గురైన బాలుడు, బయటి నుంచి బండరాయి తెచ్చి, యువతి తలపై మోదాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోగా, ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆపై గొంతుకోసి వెళ్లిపోయాడు. ఈ కేసులో బాలుడిని అరెస్ట్ చేసి బాలనేరస్తుల కారాగారానికి తరలించామని పోలీసు అధికారులు తెలిపారు