- Advertisement -
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ఐదుగురు బీటెక్ విద్యార్థుల పాలిట మ్రుత్యుపాశంగా మారింది. గేగంగా వెల్తున్న కారు డివైడర్ను ఢీకొట్టిన అనంతరం…పక్కనే ఆగి ఉన్న లారీని బలంగా గుద్దుకుంది. దీంతో ఐదుగురు విద్యార్థులు స్పాట్లోనే దుర్మరణం పాలయ్యారు.
మృతి చెందిన విద్యార్థులు ఆర్వీఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ రోజు మద్యాహ్నం కాలేజీ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించనున్నట్లు పేర్కొన్నారు.