Thursday, April 18, 2024
- Advertisement -

భారత్ లో భాషల మధ్య చిచ్చు..మరాఠాలను విలీనం..!

- Advertisement -

కర్ణాటక, మహారాష్ట్ర సర్కార్​ల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. కర్ణాటక ప్రాంతంలోని మరాఠాలను తమ రాష్ట్రంలో విలీనం చేయాలన్న ఉద్ధవ్​ ఠాక్రే వ్యాఖ్యలపై మండిపడ్డారు కన్నడ నేతలు. ఠాక్రే ప్రకటనలను ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా.. ఇరురాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని దెబ్బతీసేందుకే ఠాక్రే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

మరాఠీ మాట్లాడే ప్రజలు అధికంగా ఉండే కర్ణాటక ప్రాంతాలను తమ రాష్ట్రంలో చేర్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రే తెలిపారు. మునుపటి ముంబయి ప్రెసిడెన్సీలో భాగమైన బెల్గాం, ఇతర ప్రాంతాలను గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కానీ ప్రస్తుతం.. కర్ణాటకలో భాష ప్రాతిపదికన అలా చేయడం లేదన్నారు.

ఠాక్రే వ్యాఖ్యలపై కాంగ్రెస్​ చీఫ్ డీకే శివకుమార్​ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. సరిహద్దు వివాదాల విషయంలో తరచూ ప్రకటనలు చేస్తూ కొత్తరకం ఘర్షణలు రేపడం బాధాకరమన్న ఆయన.. ఈ విషయంలో మహాజన్​ నివేదికే తుది తీర్పు అని పేర్కొన్నారు. కాబట్టి బెళగావి మహారాష్ట్రకు చెందినది కాదని మళ్లీ నిరూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -