- Advertisement -
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అరుప్ రాహా పార్లమెంట్ ఆవరణ లోని ప్రధాన మంత్రి కార్యాలయం లో మోడీ తో స్పెషల్ గా భేటీ అయ్యారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం లో ఇప్పటికే యుద్ధ విమానాలు వాడుతున్న పరిస్థితి లో తమ సహాయం అందిస్తాం అని ఆయన చెప్పారు.
ఈ అంశంపై మోదీతో అరుప్ రాహా చర్చించారు. కరెన్సీకోసం విమానాలను ఉపయోగిస్తోన్న విధానంపై వివరించారు. కరెన్సీ రవాణాకు విమానాల కొరత లేదని చెప్పారు. ఎయిర్ఫోర్స్ విమానాల ద్వారా కరెన్సీ రవాణా నిర్విఘ్నంగా జరుగుతోందని వివరించారు. కరెన్సీని పంపీణీ చేయడానికి విమానాలను సమర్థవంతంగా వినియోగిస్తున్నట్లు చెప్పారు.