Tuesday, May 14, 2024
- Advertisement -

మ‌రో బాంబు పేల్చిన‌ ల‌గ‌డ‌పాటి… ఆందోళ‌న‌లో టీడీపీ…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం ముగిసింది. ఇక మిగిలింది పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొద‌ల‌య్యింది. గెలుపు ఎవ‌రిద‌నేదానిపై ప్ర‌జ‌ల‌ల్లోను….ఇటు రాజ‌కీయ పార్టీ వ‌ర్గాల్లోను ఉత్కంఠ నెల‌కొంది. ఇప్పుడు తాజాగా స‌ర్వేల రారాజు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ త‌న స‌ర్వేపై మ‌రో సారి బాంబు పేల్చారు. తాను చేసిన స‌ర్వేపై క్లారిటీ ఇవ్వ‌డం ఇప్పుడు అందిరిలో ఆందోళ‌న మొద‌ల‌య్యింది.

గ‌త 20 రోజులుగా ఉప ఎన్నిక‌ల్లో గెలుపు ఎవ‌ర‌నేదానిపై ప‌లు స‌ర్వేలు సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. చంద్ర‌బాబు సీఎం చేయించిన అన్ని స‌ర్వేలు వ్య‌తిరేకంగా వ‌చ్చాయి. ఇవ‌న్నీ ప‌క్క‌ప పెడితే స‌ర్వేల రారాజు రాజ‌గోపాల్ సొంతంగా స‌ర్వే చేశార‌ని అందులో టీడీపీకి అనుకూలంగా ఉంద‌ని… ఆ నివేదిక‌ను బాబు ఇచ్చిన‌ట్లు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి.

అయితే ఇప్పుడు తాజాగా వీట‌న్నింటిపై క్లారిటీ ఇచ్చారు ఆంధ్రా ఆక్టోప‌స్‌. నంద్యాల ఉప ఎన్నిక‌లో విజ‌యం ఎవ‌రిదో అంద‌రిలాగానె నేనూ ఎదురు చూస్తున్నాని తెలిపారు. స‌ర్వేలు చేయించే అల‌వాటు ఉంద‌ని… నంద్యాల‌లో మాత్రం త‌ను స‌ర్వే చేయించ‌లేదని క్లారిటీ ఇచ్చారు. టీడీపీ గెలుస్తుంది అనే విధంగా తాను స‌ర్వేలు అవాస్త‌వం అన్నారు. రాజ‌గోపాల్ ఇలా చెప్ప‌డంతో టీడీపీకి షాక్ తగిలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -