- Advertisement -
నవ్యాంధ్రలో 15వ శాసనసభ కొలువుదీరింది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం బుధవారం ఉదయం 11.05 గంటలకు 15వ శాసనసభ తొలి సమావేశం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్గా నియమితులైన శంబంగి చిన వెంకట అప్పలనాయుడు సభాపతి స్థానంలో నియమితులయ్యారు.
జాతీయ గీతాలాపన అనంతరం సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో ముందుగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ మిగతితా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.అసెంబ్లీ ద్వారం వద్ద సీఎం వైఎస్ జగన్కు పూర్ణకుంభంతో వేదపపండితులు స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శాసనసభలో బుధవారం అడుగుపెట్టారు.