ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంలో సోషల్ మీడియా అభిమానుల పాత్ర వెలకట్టలేనిది. అధికార పార్టీ టీడీపీ పోస్ట్లకు అదిరిపోయె కౌంటర్లు ఇచ్చారనడంలో సందేహంలేదు. ఇక జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లడంలో పార్టీ తరుపున నెటిజన్లు తమ వంతు పాత్ర పోషించారు. ఇక జగన్కు విజయం సాధించడంలో సోషల్ మీడియా అభిమానుల పాత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఎన్నికల్లో వైసీపీ తరపున సోషల్ మీడియా సైనికులపై ప్రశంసల వర్షం కురిపించారు. YSRCP కోసం మీరంతా హార్డ్ వర్క్ చేశారనీ, ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా పోరాడారని నాకు తెలుసు అంటూ ట్వీట్లో రాశారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో… వైసీపీ విజయంలో మీ పాత్ర కీలకం అంటూ ప్రశంసించారు జగన్. నేను హృదయపూర్వకంగా థాంక్స్ చెబుతున్నాను అంటూ జగన్… మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి అని ట్వీట్ చేశారు.
సీఎం వైఎస్ జగన్… ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు… ఎల్లో మీడియా అంటూ… కొన్ని ఛానెళ్లు, పత్రికలపై విరుచుకుపడేవారు. వైసీపీ అధికారంలోకి వస్తే, ఎల్లో మీడియాకు దబిడ, దిబిడే అంటూ కొంత మంది వైసీపీ కార్యకర్తలు తరచూ కామెంట్లు చేశారు. మరి ఇప్పుడు జగన్ ట్వీట్ను చూస్తె పచ్చమీడియాపై ఆగ్రహంతోనే ఉన్నట్లు కనిపిస్తోంది.