- Advertisement -
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంతో ఆ ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈనెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాబోయె సీఎం జగన్ను ఈ ఉదయం టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కలిశారు. తిరుమలలో స్వామివారికి ప్రత్యేకంగా ధరింపజేసిన పూజా మాల, ప్రసాదాలను తీసుకుని వచ్చిన ఆయన, జగన్ కు వాటిని అందించారు. ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
సింఘాల్ తో పాటు డాలర్ శేషాద్రి, మరికొందరు అధికారులు జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా తాను స్వామివారిని దర్శించుకుంటానని ఈ సందర్భంగా జగన్ వారికి వెల్లడించారు. అనంతరం వైసీపీ అధినేతను ఆశీర్వదించి, శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేశారు