Friday, May 3, 2024
- Advertisement -

ఏపీలో అక్టోబర్ 10న కొత్త పథకం ప్రారంభం…

- Advertisement -

మరో వైపు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు నవరత్నాల అమలుపై ఫోకస్ పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది.రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశంతో.. వైఎస్ఆర్ కంటి వెలుగు’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తున్నారు. అక్టోబరు 10వ తేదీ నుంచి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం కానుంది.

వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం తీసుకొచ్చిన ఇలాంటి పథకంపై ప్రజలనుంచి మంచి స్పందన రావడంతో ఏపీ ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయం తీసకొంది.ఈ పథకం కింద అందరికీ ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించనున్నారు. అవసరమైనవారికి కళ్లజోళ్లను ఉచితంగా అందించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -