జమ్ముకశ్మీర్ మాజీ మంత్రి, అప్నీ పార్టీ ఉపాధ్యక్షుడు అజాజ్ చౌధరీ నివాసంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలను పసిగట్టిన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటికొచ్చి త్రుటిలో ప్రాణాలు రక్షించుకున్నారు. సమాచారం అందుకొని ఘటనా స్థలికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటనలో సుమారు రూ.రెండు కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. రాంబన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తరచూ విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల అనంతరం… దేశంలో ఉగ్రదాడుల హెచ్చరికలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. అప్రమత్తమైన భద్రతా దళాలు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
మాన్యువల్ మెరినోకు వ్యతిరేకం.. హింసాత్మకం..!