- Advertisement -
కోనసీమ అల్లర్ల కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అన్యం సాయి అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. . కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టొంద్దంటూ మే 20న కలెక్టరేట్ వద్ద అన్యం సాయి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
అన్యం సాయి జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడని పోలీసులు చెబుతున్నారు. వవన్ కల్యాణ్, నాగబాబు లాంటి జనసేన నేతలతో అన్యం సాయి తీసుకున్న సెల్ఫీలు బయటకు రావడం కలకలం రేపుతోంది. నసీమ అల్లర్ల కేసులో సాయి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
అతనిపై గతంలో రౌడీషీట్ నమోదై ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు అమలాపురం ఆందోళనలు రావులపాలానికి విస్తరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ఆత్మకూర్ ఉప ఎన్నికల ఎప్పుడంటే ?