- Advertisement -
నమ్మి ప్రియుడితో ఇంటి నుంచి వెళ్లిన మైనర్ బాలికపై ఐదుగురు స్నేహితులు పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుల్తాన్బజార్కు చెందిన ఓమైనర్ బాలిక గత నెలలో ఇంటి నుంచి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.
దీంతో ఆమె తల్లిదండ్రులు గత నెల 30న సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఉప్పల్ పరిధిలోని మల్లాపూర్లోని ఓ ఇంటిలో బాలిక ఉన్నట్టు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసు స్టేషన్కు తీసుకువచ్చారు.
బాలికను విచారించగా పలు విషయాలను వెల్లడించింది. ప్రియుడితో పాటు మరో నలుగురు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు తెలిపింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు.
భరువు తగ్గనున్నా గ్యాస్ సిలిండర్.. కేంద్రం మరో కీలక నిర్ణయం..?