- Advertisement -
ఎన్నికల వేళ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ … మాటల యుద్ధానికి దిగిన చంద్రబాబు, పవన్ లు చాలా రోజుల తర్వాత కలిశారు. ఇప్పుడు వీరి కలయిన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎదురెదురు పడిన వేళ ఇద్దరు ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారు.
రామాజీరావు మనవరాలు కీర్తి వివాహం సందర్బంగా హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు… ఈ వేదికపై చిరునవ్వులు చిందించారు. వధువు, వరూలను ఆశీర్వదించిన చంద్రబాబు.. తిరుమల స్వామివారి ప్రసాదాల్ని బహుమతిగా అందించారు. దాదాపు ఏడాది తర్వాత ఈ ఇద్దరు నేతలు కలిసి మాట్లాడుకున్నారు. నమస్కారాలు చేసుకుంటూ కాసేపు ముచ్చటించుకున్నారు. గతేడాది అమరావతిలో జరిగిన ఓ ఆలయ విగ్రహ ప్రతిష్ఠలో కలుసుకున్న వీరిద్దరూ తిరిగి ఎదురుఎదురుగా కలుసుకోవడం ఇదే తొలిసారి.