- Advertisement -
కేంద్రం ముగ్గురికి భారత రత్న అవార్డును ప్రకటించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సహా ఇద్దరికి ఈ అవార్డును ప్రకటించారు.దివంగత ఆర్ఎస్ఎస్ నేత నానాజీ దేశ్ముఖ్, అస్సామీ జానపద గాయకుడు భూపెన్ హజారికాలకు కూడా భారత రత్న ప్రకటించారు. నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికాలకు మరణానంతరం ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన జారీచేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారం ప్రకటించింది